నా సినిమాలు ఆడకపోవడం వల్లే...సుమంత్

 నా గత చిత్రం సరిగ్గా ఆడకపోవడంవల్ల కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాను అంటున్నారు హీరో సుమంత్. సుమంత్‌ హీరోగా కుమార్‌ బ్రదర్స్‌ నిర్మించే చిత్రం ఓపినింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. విజి శిపివిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. డి.రామానాయుడు దర్శకుడికి స్క్రిప్ట్‌ అందించారు. తొలి దృశ్యానికి శ్రీ మిత్ర చౌదరి కెమెరా స్విచాన్‌ చేయగా, అక్కినేని నాగార్జున క్లాప్‌ ఇచ్చారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా విమలారామన్‌ చేస్తోంది. జూన్‌, జులై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తి చేసి దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ కొత్త చిత్ర విశేషాలు చెబుతూ సుమంత్...నిమిది నెలల క్రితం ఈ కథ ఓకే చేశాను. కథ చాలా కొత్తగా ఉంది. మొదటిసారి ట్రయాంగిల్‌ రొమాంటిక్‌ స్టోరీ చేస్తున్నాను అన్నారు ఇదొక ట్రెండీ లవ్‌స్టోరీ. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌..ఇలా అన్నీ ఉంటాయి. నా అన్ని సినిమాల్లోనూ హీరోయిన్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అలానే ఉంటుంది' అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో అతిథిగా పాల్గొన్న ప్రియమణి మాట్లాడుతూ..."ఈ బేనర్‌లో నేను 'సాధ్యం' సినిమా చేశాను. మంచి సినిమాలు అందించాలనే తపన ఉన్న నిర్మాతలు వీరు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అంది. ఇక సుమంత్ ప్రస్తుతం అష్టా చెమ్మ ఫేమ్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది ఆగస్ట్‌లో విడుదల అవుతుంది.
Category: 0 comments

No comments:

Pages