33 ఏళ్ల వరునితో 41 ఏళ్ల మనీషా కొయిరాలా పెళ్లి

బాలీవుడ్ ప్రౌఢసుందరి మనీషా కొయిరాలా ఓ ఇంటిది కాబోతోంది. నిన్నటితో 41 ఏళ్లు నిండిన మనీషా కొయిరాలా సమ్రాట్ దహల్ అనే కుర్రాడిని నేపాల్ లోని ఖాట్మాండులో వివాహమాడబోతోంది. ఆమె వివాహానికి నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్, ప్రధాని మాధవ్ కుమార్, మావోయిస్ట్ చీఫ్ ప్రచండ, జ్ఞానేంద్రతోపాటు బాలీవుడ్ నటుడు గోవింద కూడా హాజరవుతారని సమాచారం.

కాగా తన పెళ్లి నేపాలి సంప్రదాయాలను అనుసరించి చేసుకోబోతున్నట్లు మనీషా వెల్లడించింది. ఇక రిసెప్షన్‌కు సుమారు 3వేల మంది అతిథులను ఆహ్వానించినట్లు తెలిపింది.

ఇదిలావుంటే మనీషా కొయిరాలా ఇంతకుముందే ఒకరిని వివాహం చేసుకోవాలనుకుని నిశ్చితార్థం వరకూ వెళ్లిందట. కానీ ఇద్దరి అభిప్రాయాలు వేరు కావడంతో ఆ నిశ్చితార్థం రద్దయిందని సమాచారం. ఏదైతేనేం.. కనీసం ఇప్పటికైనా మనీషా పెళ్లి చేసుకుంటున్నందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Category: 0 comments

No comments:

Pages